
రోహిణీ కార్తె పూర్తి కాకముందే తెలంగాణలో వర్షా కాలం ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు వ్యాపించడంతో వానాకాలం ముందస్తుగా ప్రారంభమైందనే దానికి సంకేతంగా భవిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ రోజు (మే 27, మంగళవారం)తో పాటు వచ్చే 4 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ భారీ వర్షాలు, రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
నిన్న మరాట్వాడా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు (మే 27) బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి ఇవాళ దక్షిణ చత్తీస్గడ్ పరిసరాల్లోని పశ్చిమ విదర్భ ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతోంది.
అదే విధంగా ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ (మే 27) ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వాయువ్య ప్రాంతంలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తెలంగాణ నుంచి దూరంగా తరలి పోయినందు వల్ల దీని ప్రభావం పెద్దగా లేదన్నారు వాతావరణ కేంద్ర నిపుణులు.
నైరుతి రుతుపవనాల రాకతో ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం ప్రకటించింది. మరో మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అకవాశం ఉందని ప్రకటిచంచారు. గాలి గంటకు 40-50 కి. మీ వేగంతో దాదాపు అన్ని జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ ‘మే 27) భారీ వర్షాలు :
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసి అవకాశంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు. అదే విధంగా రేపు, ఎల్లుండి (28,29)రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
►ALSO READ | సినిమా థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేంటో తేల్చాలి: పవన్ కళ్యాణ్
నైరుతి రుతుపవనాల రాకతో ఈ మూడురోజులలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. రేపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రేపు(మే 27) భారీ వర్షాలు:
రాష్ట్రంలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు.