భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డయల్ 100కు ఫోన్ రాగానే వెంటనే స్పందించి స్పాట్కు వెళ్లి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ బి.రోహిత్ రాజు సూచించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో బుధవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు.
క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రతి కేసును దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. భద్రాచలం ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ఎల్.ఆదినారాయణ, సతీశ్ కుమార్, రవీందర్రెడ్డి, వెంకన్న బాబుతోపాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
