
తిరువనంతపురం: భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు తీసుకెళ్లే స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదా పడింది. మంగళవారం (జూన్ 10) సాయంత్రం 5:52 గంటలకు జరగాల్సిన ప్రయోగం బుధవారం సాయంత్రానికి పోస్ట్ పోన్ అయింది.
ఈ విషయాన్ని నాసా, యాక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ప్రకటించాయి.ఇది యాక్సియమ్ మిషన్ -4లో భాగంగా చేపడుతున్న ప్రత్యేక మిషన్. దాదాపు 28 గంటల ప్రయాణం తర్వాత జూన్ 11న రాత్రి 10 గంటలకు మిషన్ సిబ్బంది ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్కు చేరుకుంటారని భావించారు.
ఈ మిషన్ 14 రోజుల పాటు కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. యాక్సియమ్ 4 మిషన్లో భారత్, పోలెండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు ఉన్నారు.