లాస్య నందిత లేని లోటు అసెంబ్లీలో కనిపించనుంది: గడ్డం ప్రసాద్

లాస్య నందిత లేని లోటు అసెంబ్లీలో కనిపించనుంది:  గడ్డం ప్రసాద్

హైదరాబాద్ ఓఆర్ఆర్ కారు ప్రమాదంలో లాస్య నందిత మృతి పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య మృతి చాలా బాధ కలిగించిందన్నారు. లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సాయన్న కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ లో సాయన్న కుటుంబ సేవలు మరువలేనివని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. సాయన్న కూతురుగా ఎమ్మెల్యే లాస్య నందిత ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న యువ నాయకురాలని చెప్పారు. 

లాస్య మృతి కుటుంబానికి, రాజకీయ శ్రేణులకు తీరని లోటని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు. లాస్య నందిత లేని లోటు అసెంబ్లీలో కనిపించనుందని అన్నారు.