బీసీ హాస్టల్ ను తనిఖీ చేసిన స్పీకర్

బీసీ హాస్టల్ ను తనిఖీ చేసిన స్పీకర్
  • హాస్టల్ లో సదుపాయాలను పరిశీలించిన స్పీకర్

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ తనిఖీ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెరెడ్డి. వంట గదిని పరిశీలిస్తున్న సమయంలో కాలం చెల్లిన పసుపు ప్యాకెట్ కనిపించింది. దీంతో వార్డన్ పై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన వంట సరుకులు వాడుతున్నారా.. ? శుభ్రంగా.. శుచిగా వండాల్సిందిపోయి కాలం చెల్లిన సరుకులు ఉపయోగిస్తున్నారా .? అంటూ మండిపడ్డారు. 
 హాస్టల్ లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పిల్లలకు వంటలు రుచిగా వండాలని వార్డెన్ కు సూచించారు. చెప్పడమే కాదు రుచి ఎలా ఉందో తెలుసుకునేందుకు విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. హాస్టల్ లో వంటలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్లు హాస్టల్ లో విద్యార్థులు టిఫిన్ తినడం పూర్తయ్యే వరకు హాస్టల్ లోనే ఉండాలని సూచించారు.