ప్రాణం ఉన్నంత వరకు కేసీఆరే మా లీడర్: పోచారం

ప్రాణం ఉన్నంత వరకు కేసీఆరే మా లీడర్: పోచారం

తన 47 ఏడేండ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని మంత్రులు, ఎంతో  మంది ముఖ్యమంత్రులను చూశానని..కానీ కేసీఆర్ వంటి నాయకుడిని చూడలేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కేసీఆరే తమ నాయకుడని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సహకారంతో బాన్సువాడను అభివృద్ధిలో తీసుకుపోతున్నానని వెల్లడించారు. 

సుపరిపాలన, సుభీక్షమైన పరిపాలన కావాలంటే మాటలు చెప్తే చాలదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మైకులు పట్టుకుని ఉత్తమాటలు చెప్తే నడవదని ప్రతిపక్షాలను విమర్శించారు. దేశంలో పనిచేసే నాయకుడు ఎవరూ లేరని చెప్పారు. దేశంలో రైతులు, ప్రజలు బాగుపడాలంటే కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.