చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక బస్సులు...

చేప ప్రసాదం పంపిణీకి  ప్రత్యేక బస్సులు...

14 డిపోల నుంచి 80, ఎయిర్​పోర్ట్ ​నుంచి 60 బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈనెల 8న జరిగే చేప ప్రసాద పంపిణీకి తరలివచ్చేవారి కోసం గ్రేటర్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నది. మృగశిర కార్తె సందర్భంగా 8, 9 తేదీల్లో బత్తిన కుటుంబం ఎగ్జిబిషన్​గ్రౌండ్​లో చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. దీని కోసం వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో అస్తమా బాధితులు తరలివస్తారు. వీరికి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి  ప్రత్యేక బస్సులు నడపనున్నది. 8వ తేదీన 60 , 9వ తేదీన 80 బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. 

సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి  రైల్వే స్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, నాంపల్లి, కోఠి, ఈసీఐఎల్​క్రాస్​రోడ్స్​, శంషాబాద్​ఎయిర్​పోర్ట్​ తదితర ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్రేటర్​లోని 14 డిపోల నుంచి 80 బస్సులు, ఎయిర్​పోర్ట్​నుంచి 60 బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా నార్మల్​ రేట్లనే వసూలు చేస్తామని, ప్రయాణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.