
హైదరాబాద్సిటీ, వెలుగు: చారిత్రక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడుపనున్నారు. ఇందుకోసం 100 బస్సులను అందుబాటులో ఉంచారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్, జేబీఎస్, జీడిమెట్ల, పటాన్చెరు, మెహదీపట్నం, ఈసీఐఎల్క్రాస్రోడ్స్, దిల్సుఖ్నగర్, హయత్నగర్, కూకట్పల్లి, రిసాలా బజార్, చెర్లపల్లి, రాజేంద్రనగర్, రామ్నగర్, ఉప్పల్, బోరబండ, మిథాని, కేపీహెచ్బీ కాలనీ, ఓల్డ్ బోయిన్పల్లి, మల్కాజిగిరి, బాలాజీనగర్ నుంచి లాల్దర్వాజాకు ప్ర్యతేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు 9959226154, 9959226160 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.