హోళీకి స్పెషల్​ ట్రైన్లు

హోళీకి స్పెషల్​ ట్రైన్లు

సికింద్రాబాద్, వెలుగు: హోళీ పండుగ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో స్పెషల్​ట్రైన్లు ఏర్పాటు చేసింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 23, 25, 26 తేదీలలో ఈ రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్– -ధనాపూర్, ధనాపూర్ – హైదరాబాద్, సికింద్రాబాద్– హౌరా, హౌరా – -సికింద్రాబాద్, సంత్రగచ్చి– సికింద్రాబాద్ మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు ఈనెల 24న సంత్రగచ్చి– చెన్నైసెంట్రల్, 27న పాట్నా–-కోయంబత్తూర్​స్టేషన్ల మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు.