మల్కాజిగిరి, వెలుగు: చిన్నపాటి గల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇంటి ముందు ఉన్న కారును వేగంగా ఢీకొట్టడంతో ఆ కారు బోల్తా పడి డ్యామేజ్ అయింది. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ దీన్ దయాల్ నగర్లో జరిగింది. శనివారం ఫణి రాజ్ కుమార్ ఇంటి ముందు కారు పార్క్ చేశాడు.
అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఎస్.వనజలక్ష్మి అనే డాక్టర్ వేగంగా కారు డ్రైవ్ చేస్తూ.. ఫణి రాజ్కుమార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడి కొంతవరకు డ్యామేజ్ అయింది. అంతేగాకుండా సమీపంలోని ఇంటి మీదికి కారు దూసుకుపోయిందని స్థానికులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సందీప్ కుమార్ తెలిపారు.
