
- గాల్లోకి ఎగిరిపడ్డ మహిళలు
- ఇద్దరు మృతి, మరొకరు సీరియస్
చేవెళ్ల, వెలుగు: కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు మహిళలు బలయ్యారు. మరో మహిళ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. హిమాయత్నగర్కు చెందిన అశ్విని, ఆమె బంధువు లక్ష్మి కలిసి స్కూటీపై మొయినాబాద్ పరిధిలోని రెడ్డిపల్లిలోని మీసేవా కేంద్రానికి బయలుదేరారు. చిల్కూర్ వద్ద మేడిపల్లికి చెందిన సుశీల లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో వారిని కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో అశ్విని, సుశీల మృతి చెందారు. లక్ష్మి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బైక్ అదుపుతప్పి మరొకరు
ఇబ్రహీంపట్నం: బైక్అదుపుతప్పి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ పరిధిలోని వినాయక్నగర్కు చెందిన అమర్నాథ్ (39) మంగళవారం ఉదయం తన ఫ్రెండ్తో కలిసి బైక్పై తుక్కుగూడకు వెళ్తుండగా, రావిర్యాల చెరువు కట్ట వద్ద అదుపు తప్పి కరెంట్పోల్కు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ అమర్నాథ్బుధవారం సాయంత్రం మృతిచెందాడు.
లారీని స్కూటర్ ఢీకొనడంతో..
లారీని స్కూటర్ ఢీకొనడంతో మరొకరు మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడకు చెందిన బుట్టి ప్రేమ్రాజ్(65) బుధవారం తన స్కూటర్ పై బొంగులూర్వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో లారీ డ్రైవర్ సడన్గా యూటర్న్తీసుకోవడంతో వెనుక టైర్ల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమీప హాస్పిటల్కు తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.