
హుషారు, రౌడీబాయ్స్ తర్వాత దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’(Om Bheem Bush). శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్లో గుప్తనిధుల కోసం ముగ్గురు యూనివర్సిటీ స్టూడెంట్స్ చేసిన అన్వేషణను క్రేజీగా చూపించారు.టైటిల్ తరహాలోనే కథలోనూ మ్యాజిక్ ఉంది. పారానార్మల్ యాక్టివిటీస్, ఆత్మలు, లంకె బిందెలు లాంటి మిస్టీరియస్ అంశాలు ఉన్నా ట్రైలర్ ఆసక్తిగా ఉంది.
ఏం కష్టం వచ్చిన నేనున్నా అని ఒక అమ్మాయిని శ్రీ విష్ణు అడగ్గా..నాకొక మగా పురుషుడు కావాలి..అని చెప్పే డైలాగ్ నవ్వించేస్తోంది.ఇక ఊర్లో స్వామిజీ వచ్చి వీళ్ళు మగాలైతే ఆ సంపన్న మహల్ లో ఉన్న నిధి తీసుకురమ్మని చెప్పండి అని చెప్పడంతో..ఆ మహల్ కి వెళ్లి..అక్కడ పరిశోధించిన సీన్స్..వచ్చే డైలాగ్స్ ఆద్యంతం నవ్వించేలా ఉన్నాయి. ట్రైలర్ చివర్లో సుస్వాగతం భైరవపురం అంటూ హిట్ పెంచేశారు.
యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బ్రోచేవారెవరురా సినిమాలో ఫుల్ గా నవ్వించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్.. ఇప్పుడు ఈ సినిమాతో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తారో లేదు చూడాలి.