హార్ట్‌ఫుల్ కథకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. పాతికేళ్ల యువ దర్శకుడి సంచలనం

హార్ట్‌ఫుల్ కథకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. పాతికేళ్ల యువ దర్శకుడి సంచలనం

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు.  అతిథిగా హాజరైన  డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ ‘పాతికేళ్ల అబ్బాయి ఇంత ప్యాషన్‌‌తో సినిమా తీయడం  మామూలు విషయం కాదు.  ఈ సినిమాలో నిజాయితీ ఉంది.  హార్ట్‌‌ఫుల్‌‌గా చెప్పిన ఈ  కథ ఓటీటీలో మరింత పెద్ద విజయం సాధిస్తుంది’ అని అన్నారు.

దర్శకులు వేణు ఉడుగుల, సాయిలు పాల్గొని చాలా కొత్తదనంతో ఉన్న సినిమా ఇదని చెప్పారు.  ‘థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం  ఈటీవీ విన్‌‌లో కూడా  మంచి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం’ అని హీరో హీరోయిన్ అన్నారు.

ఓటీటీ ద్వారా ఇంకా ఎక్కువమందికి ఈ చిత్రం చేరువవుతుందని డైరెక్టర్ వినయ్ రత్నం చెప్పాడు. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.