
'మత్తు వదలరా’ చిత్రంతో సక్సెస్ను అందుకున్న కీరవాణి కొడుకు శ్రీసింహ కోడూరి..ఇప్పుడు దీని సీక్వెల్ (మత్తు వదలరా 2) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్లో నటిస్తోంది.
లేటెస్ట్గా మత్తు వదలరా 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరో శ్రీ సింహా, కమెడియన్ సత్య కామెడీ డైలాగులతో నవ్వించారు. వెల్కమ్ టు ‘హీ’ టీమ్ అంటూ సాగే ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. హి..హి..హి.. టీమా అంటే అన్నీ హిలు లేవు.. ఒకటే హి అంటూ ఫన్నీగా సాగుతున్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గు లేదా.. అంటుంటే.. అయినా ఇది దొంగతనం కాదు.. తస్కరించుట అంటున్నాడు సత్య. ఫస్ట్ పార్ట్ కంటే నెక్స్ట్ లెవల్లో ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని విషయం టీజర్ తో అర్ధమవుతోంది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:-రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఇస్తారు?
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.