హిమాయత్​నగర్ టీటీడీ ఆలయంలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

హిమాయత్​నగర్ టీటీడీ ఆలయంలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

బషీర్​బాగ్ వెలుగు :  హిమాయత్​నగర్ టీటీడీ ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి.  ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. తర్వాత శేష వాహనంపై స్వామివారిని ఊరేగించారు. 

ఉత్సవాల సందర్భంగా కేంద్ర కిషన్​రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనం అందజేశారు.