
బషీర్బాగ్ వెలుగు : హిమాయత్నగర్ టీటీడీ ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. తర్వాత శేష వాహనంపై స్వామివారిని ఊరేగించారు.
ఉత్సవాల సందర్భంగా కేంద్ర కిషన్రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనం అందజేశారు.