మహేశ్వరంలో బీజేపీ గెలుపు ఖాయం: శ్రీరాములు యాదవ్

మహేశ్వరంలో బీజేపీ గెలుపు ఖాయం: శ్రీరాములు యాదవ్

బడంగ్ పేట్,వెలుగు: మహేశ్వరంలో బీజేపీ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ధీమా వ్యక్తంచేశారు.  ఆదివారం మహేశ్వరం మండలం సిరిగిరి పురం, గంగారం, కేబీతండా, కేసీ తండా,ఎన్ డీ తండా,తుమ్మలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలన్నారు. 

ఆ రెండు పార్టీలకు  అవినీతికి కేరాఫ్ అని విమర్శించారు. ప్రజలు ఆ పార్టీలను బొంద పెడతారన్నారు. బీజేపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమన్నారు. బీజేపీతోనే సుస్థిరమైన పాలన వస్తుందన్నారు. కార్యక్రమంలో సిరిగిరి పురం సర్పంచ్ కాసుల సురేశ్, తుమ్మలూరు ఎంపీటీసీ మద్ది రాంరెడ్డి, పలువురు బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.