శ్రీశైలం మహాశివరాత్రి హుండీ ఆదాయం రూ.5 కోట్ల 61 లక్షలు

శ్రీశైలం మహాశివరాత్రి హుండీ ఆదాయం రూ.5 కోట్ల 61 లక్షలు

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.  ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.   శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు.  శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలతో పాటు పరివార ఆలయాల హుండీలను లెక్కించారు .

చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 61 లక్షల 81 వేల 535 రూపాయల నగదు లభించిందని  దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.  ఈ ఆదాయాన్ని గత 13 రోజులులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

హుండీ లెక్కింపులోలభించిన కానుకల వివరాలు

  • నగదు :  5 కోట్ల 61 లక్షల 81 వేల 535 రూపాయలు
  • బంగారం : 124 గ్రాముల 500 మిల్లి గ్రాములు
  • వెండి : 5 కిలోల 550  గ్రాముల

విదేశీకరెన్సీ వివరాలు

  • యూఎస్​ ఏ డాలర్లు : 22
  • యు.ఎ.ఇ దిర్హమ్స్ : 10
  • సౌదీరియాల్స్ : 5
  • సింగపూర్ డాలర్లు : 4
  • ఇంగ్లాండు పౌండ్స్ : 25
  •  మలేషియా రింగిట్స్ : 1
  • ఓమన్ బైసాలు : 100
  • ఆస్ట్రేలియా డాలర్లు :15
  • యూరోలు : 5
  •  కత్తారు రియాల్స్ : 1
  •  ఓమన్ రియాల్స్ : 1
  • థాయిలాండ్ భట్స్  : 100 

కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ లెక్కింపు  ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది.  ఈ కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాల సిబ్బంది.. శివ సేవకులు పాల్గొన్నారు.