
శ్రీశైల క్షేత్రం పోలీసులతో నిండిపోయింది. ఈ నెల 16న ప్రధాని మోదీ భ్రమరాంభ సమేత శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్తో సహా 1800 మంది పోలీస్ ఉన్నతాధికారులు.. ఇతర సిబ్బంది.... ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ప్రధాని పర్యటించే ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నంద్యాల ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి వరకు బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందికి లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం జరిగింది.
ప్రధాని మోదీ హెలిపాడ్ కు చేరుకున్నప్పటి నుంచి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వరకు ఆయన పర్యటించే ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. ముఖ్యమైన ప్రాంతాలలో ... కూడళ్లలో సాయిధ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు.
ప్రధాని పర్యటన సందర్భంగా బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్ కు ఒక ఉన్నతాధికారిని ఇన్ చార్జిగా నియమించారు. జియో గ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాలలో తీసుకోవలసిన భద్రత చర్యల గురించి నంద్యాల ఎస్పీ వివరించారు.
ప్రధాని మోదీ పర్యటించే .. రోడ్డు మార్గాలలో.. ముఖ్యమైన కూడళ్లలో .. గుడి పరిసర ప్రాంతాలలో రూప్ టాప్ సిబ్బందిని నియమించి వారిని బైనాక్యులర్ తో నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీచేయాలని ఇది 24/7 కొనసాగించాలన్నారు.కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కెమెరాలను పరిశీలించాలని ... అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.