భారీగా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం

భారీగా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు హుండీ లెక్కింపు అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భారీగా మల్లన్నకు హుండీ ఆదాయం వచ్చింని దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ లెక్కింపు ద్వారా దేవస్థానానికి 5 కోట్ల 11 లక్షల 94 వేల 935 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 

ఈ ఆదాయాన్ని గత 13 రోజులులో స్వామి అమ్మవార్లకు భక్తులు కనుకాలుగా నగదు రూపంలో సమర్పించినట్టు దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు. వీటితో పాటు 100 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 6 కేజీల 500 గ్రాముల వెండి లభించాయి. నగదుతో పాటు, విదేశీ కరెన్సీ కూడా ఈ లెక్కింపులో వచ్చాయి. పటిష్టమైన నిఘా మధ్య ఆలయ ఈవో లవన్న పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో.. దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.