
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బీకాంలో కొత్త కోర్సు రిటైల్ ఆపరేషన్స్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైల్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా 60 సీట్లతో దోస్త్ రెండో విడతకి అనుమతి లభించినట్లు వివరించారు. ఇంటర్ ను ఏ గ్రూప్ లో పూర్తి చేసినా, డిగ్రీలో బీకాం(రిటైల్ ఆపరేషన్స్) కోర్సుకు అర్హులేనని తెలిపారు.