మానవత్వాన్ని చాటుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్

మానవత్వాన్ని చాటుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని దగ్గరుండి హాస్పిటల్ కు తరలించారు. చెన్నైలోని సచివాలయానికి వెళ్తుండగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దీంతో ఆ వ్యక్తి తలకు గాయాలయ్యాయి. అప్పుడే ఆ దారిలో వెళ్తున్న సీఎం స్టా్లిన్ వెంటనే తన కాన్వాయ్ ఆపి బాధితుడిని ఆటోలో ఎక్కించారు. అనంతరం చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి వెంట ఓ సెక్యూరిటీ గార్డును పంపించారు. ఆ తర్వాత స్టాలిన్‌ థౌజెండ్‌లైట్స్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ ఎళిలన్‌కు ఫోన్‌చేసి రాయపేట ఆస్పత్రికి వెంటనే వెళ్ళి గాయపడిన వ్యక్తికి వైద్యులు సరైన వైద్యం అందించేలా చూడాలని ఆదేశించారు.

తమిళనాడు తీరంలో ఓ మత్స్యకారునిపై ఇండియన్ నేవీ హెచ్చరికలు చేస్తూ, కాల్పులు జరిపింది. ఈ ఘటనలో మత్స్యకారుడికి గాయాలయ్యాయి. దీనిపై సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తర్వాత ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. సాయుధ దళాలు సంయమనం పాటించేలా ఆదేశించాలని ప్రధానిని లేఖలో కోరారు.