
గండిపేట, వెలుగు: నక్షత్ర తాబేళ్లను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పరిధిలో బాలస్వామి అనే వ్యక్తి బ్లూ సార్క్ పేరుతో అక్వేరియం షాపు నిర్వహిస్తున్నాడు. ఇందులో నక్షత్ర తాబేళ్లను అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, నాలుగు నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.