
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో సందడిగా మారింది. లాక్ డౌన్ తర్వాత ఇవాళ్టి(సోమవారం, జూన్-1) నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్కు చేరుకోవాలన్న నిబంధనతో ప్రయాణికులు ముందే తరలివస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికుల క్యూ రోడ్డుపైకి వచ్చేసింది. స్టేషన్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. స్టేషన్కు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల తర్వాత ఎలాంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపిస్తారు. ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లు కూడా జారీ చేయనున్నారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలోని ఫుడ్ కోర్టులు, ఇతర షాపులు తెరుచుకున్నప్పటికీ పార్శిళ్లు మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.