
యూబ్యూబర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే కొత్త రూల్స్వచ్చాయి.గతంలో ఉన్నట్లు ఎవ్వరు పడితే వారు యూట్యూబ్లైవ్ స్ట్రీమ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళా రూల్స్ లేవు.. గీల్స్ లేవు అని యూట్యూబ్ లో లైవ్వీడియోలు చేస్తామంటే కుదరదు. మీ అకౌంట్లు క్లోజ్అవుతాయి.జూలై నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్అమలు చేస్తోంది. ఆ రూల్స్ఏంటీ.. ఏయే ఏజ్ గ్రూప్ వాళ్లకు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ అందుబాటులో ఉండదో వివరాల్లోకి వెళితే..
లైవ్ స్ట్రీమింగ్ (Live Streaming) విషయంలో యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా యంగ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు అమలు చేస్తోంది..ఈ నిబంధనలు జూలై 15 నుంచి అమలులోకి రానున్నాయి.
యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్కు కొత్త రూల్స్..
యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్కు జూలై 22, 2025 నుంచికొత్త విధానం అమల్లోకి రానుంది. కొత్త రూల్స్ ప్రకారం.. ఇప్పుడు యూట్యూబ్లో సొంతంగా లైవ్ స్ట్రీమ్ చేయడానికి కనీసం 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గతంలో ఇది 13 సంవత్సరాలుగా ఉండేది.
13నుంచి15 యేళ్ల టీనేజర్లు లైవ్ స్ట్రీమ్లలో కనిపించవచ్చు. అయితే వారితో తప్పనిసరిగా వాళ్ల పెద్దవాళ్లు ఉండాలి. వాళ్లు ఆ ఛానెల్కు ఎడిటర్ (editor), మేనేజర్ (manager), ఓనర్ (owner) గా ఉండాలి. పెద్దవాళ్లే లైవ్ స్ట్రీమ్ను ప్రారంభించాలి.
ఒకవేళ ఈ నిబంధనలు పాటించకపోతే యూట్యూబ్ లైవ్ చాట్ను డిసేబుల్ చేయడం, స్ట్రీమ్ను తొలగించడం, తాత్కాలికంగా లైవ్ స్ట్రీమింగ్ యాక్సెస్ను రద్దు చేస్తారు. పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారు.
యంగ్యూట్యూబ్ యూజర్ల భద్రత,ఆన్లైన్లో వారికి ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడం ఈ కొత్త నిబంధనల ఉద్దేశం. లైవ్ స్ట్రీమింగ్ అనేది రియల్ టైమ్స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుందని యూట్యూబ్ భావిస్తోంది. పిల్లలు ,యువకుల పట్ల ఆన్లైన్ దుర్వినియోగాన్ని అరికట్టే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూట్యూబ్ చెబుతోంది.
ఈ మార్పులు యంగ్ యూబ్యూటూబర్లకు ముఖ్యంగా గేమింగ్ ,ఇతర కంటెంట్ క్రియేటర్లకు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చిన్న వయసులోనే స్ట్రీమింగ్ ప్రారంభించేవారే ఉన్నారు. అయితే ఋ కొత్త రూల్స్య్యూట్యూబ్ ప్లాట్ఫాంలో మరింత భద్రత పెంచేందుకు అని యూట్యూబ్ సంస్థ చెబుతోంది.