రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై స్టేట్ జీఎస్టీ దాడులు

రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై స్టేట్ జీఎస్టీ  దాడులు

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా రాష్ట్రంలో ఆయన కంపెనీలపై దాడులు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడు గంటలుగా  ఈ సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుశీ ఇన్ ఫ్రాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తూ.. సుశీ ఇన్ ఫ్రాపై  జీఎస్టీ ఆఫీసర్లు సోదాలు  చేస్తున్నారు. సుశీ ఇన్ ఫ్రా ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు.