
గ్రేటర్ వరంగల్, వెలుగు : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ సర్వేయ్ సంగీత చెప్పారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం కేఎంసీలో సౌకర్యాలు లేవని ఫిర్యాదులు అందడంతో శుక్రవారం ఆమె కాలేజీని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం చర్యలు వసతులు కల్పిస్తామని చెప్పారు.
హాస్పిటల్కు వచ్చే రోగులకు క్వాలిటీ వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. ఆమె వెంట కలెక్టర్ సత్య శారదాదేవి, హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ కేఎంసీ ప్రిన్సిపాల్ రాంరెడ్డి, మోహన్దాస్, డీఎంహెచ్వో అప్పయ్య ఉన్నారు.