బీజేపీ, బీఆర్ఎస్ కంబైన్డ్ టీమ్ : మన్సూర్ అలీఖాన్

బీజేపీ, బీఆర్ఎస్ కంబైన్డ్ టీమ్ : మన్సూర్ అలీఖాన్
  • కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు
  • ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్

షాద్ నగర్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని, ఇక ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్ చార్జి మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ కంబైన్డ్ టీమ్​అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టౌన్ లో గురువారం సాయంత్రం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ మోసాలు పదేళ్లుగా కొనసాగుతున్నాయని, దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలు, ఓబీసీ, మైనార్టీలు, యువతకు, మహిళలకు, రైతులకు ఇలా అన్నివర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు. 

ల్యాండ్.. సాండ్.. లిక్కర్ మాఫియాలుగా ప్రభుత్వ పెద్దలు తయారయ్యారని ఆరోపించారు. అనంతరం మన్సూర్ అలీ ఖాన్ ను పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో  రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పార్లమెంట్ ఇన్ చార్జి జంగయ్య యాదవ్, ఆలేరు నియోజకవర్గ ఇన్ చార్జి  బీర్ల ఐలయ్య, సీనియర్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, ఆదివాసీ గిరిజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పి. రఘు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్ తదతరులు పాల్గొన్నారు.