కామారెడ్డి జిల్లాలో ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

కామారెడ్డి జిల్లాలో ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఎస్జీఎఫ్​ రాష్ట్ర స్థాయి అండర్​14 బాలబాలికల హాకీ పోటీలు సోమవారం ముగిశాయి.  పోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో నిజామాబాద్​మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు రెండు

మూడు స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ ​విజేతగా నిలవగా, నిజామాబాద్, రంగారెడ్డి టీమ్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విజేతలకు డీఈవో రాజు మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. ఎస్జీఎఫ్ ​జిల్లా సెక్రెటరీ రసూల్, సాయిమౌర్య తదితరులు పాల్గొన్నారు.