హనుమకొండ జిల్లా ఉప్పల్ స్టేషన్ ​వద్ద ప్రమాదం..రైల్లోంచి జారిపడి స్టేషన్ మాస్టర్ మృతి

హనుమకొండ జిల్లా ఉప్పల్ స్టేషన్ ​వద్ద ప్రమాదం..రైల్లోంచి జారిపడి స్టేషన్ మాస్టర్ మృతి
  • కమలాపూర్ మండలం ఉప్పల్ స్టేషన్ ​వద్ద ప్రమాదం
  • సొంతూరు భూపాలపల్లి జిల్లా చల్లగరిగెలో విషాదం

కమలాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి స్టేషన్ మాస్టర్​మృతిచెందిన ఘటన  హనుమకొండ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. జయశంకర్​భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన జనగాం మహేశ్(39) జమ్మికుంటలో రైల్వే స్టేషన్ మాస్టర్. అతనికి భార్య, కూతురు ఉన్నారు.  

రోజూలాగే విధులకు వెళ్లిన ఆయన సోమవారం ఉదయం అండమాన్​ఎక్స్ ప్రెస్ రైలులో జమ్మికుంట నుంచి వరంగల్ కు వెళ్తున్నాడు. రైలు కమలాపూర్ మండలం ఉప్పల్ స్టేషన్​వద్దకు చేరగానే మహేశ్ ప్రమాదవశాత్తు అందులోంచి జారిపడి స్పాట్ లో చనిపోయాడు. ఘటనపై రైల్వే అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహేశ్​మృతితో సొంతూరిలో తీవ్ర విషాదం నెలకొంది.