‘కుట్టు’ మారింది.. బువ్వ పెడుతోంది

‘కుట్టు’ మారింది.. బువ్వ పెడుతోంది

కరోనా ఎఫెక్ట్‌‌తో లేడీస్ టైలర్ల బతుకు భారం అమవుతోంది.. పెళ్లిలు, ఇతర ఫంక్షన్లు తగ్గడంతో బట్టలు కుట్టించుకునే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అల్టర్నేట్ బిజినెస్ ల వైపు చూస్తున్నారు. వరంగల్‌‌ లక్ష్మిపురానికి చెందిన సరోజన అనే లేడీస్‌ ‌టైలర్‌ కరోనా నేపథ్యంలో మాస్కులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని అదే బిజినెస్ గా మల్చుకున్నారు. వివిధ రకాల మాస్కులు కుట్టి అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. మాస్కు సైజును బట్టి 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకూ అమ్ముతున్నారు. కరోనా లాక్ డౌన్ కష్ట కాలంలో మాస్కులే వీరి కుటుంబానికి జీవనోపాధిగా మారి కుటుంబ సభ్యుల కడుపు నింపుతున్నాయి. – వెలుగు, వరంగల్.