
- చదువుకోవడం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య
- మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఘటన
దండేపల్లి, వెలుగు: ఇంటర్ తరువాత చదువుకోవడం ఇష్టం లేక ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తహసీనోద్దీన్, మృతుడి తండ్రి పొన్నం చంద్రగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన పొన్నం తరుణ్ గౌడ్(18) ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేశాడు. బీటెక్ చేయమని తల్లిదండ్రులు కోరగా, తనకు చదవడం ఇష్టం లేదని వ్యాపారం చేస్తానని చెప్పాడు.
ఇప్పుడే వ్యాపారం వద్దు, చదువుకోమని చెప్పిన తండ్రి చంద్రగౌడ్ పెద్ద కొడుకుతో కలిసి కరీంనగర్లోని ఇంజనీరింగ్ కాలేజీలు చూసివచ్చారు. అప్పటి నుంచి ముభావంగా ఉండడంతో పాటు తల్లిదండ్రులపై తరచూ కోపగించుకునేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.