ఇవాళ స్ట్రీట్ కాజ్5కె రన్

ఇవాళ స్ట్రీట్ కాజ్5కె రన్

ఖైరతాబాద్, వెలుగు: స్ట్రీట్ కాజ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఆదివారం పీపుల్స్​ప్లాజాలో 5కె రన్​నిర్వహిస్తున్నట్టు పల్లవి ఫౌండేషన్​సీఈఓ యశస్వి మల్క తెలిపారు. ఉదయం 6 గంటలకు రన్​ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, పల్లవి గ్రూప్​విద్యాసంస్థల చైర్మన్​ఎం.కొమరయ్య పాల్గొంటారన్నారు. 5కె రన్​లో దాదాపు10 వేల మంది స్టూడెంట్లు పాల్గొంటారని చెప్పారు. రన్​ప్రారంభానికి యుందు జుంబా డ్యాన్స్​తోపాటు వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని స్ట్రీట్​కాజ్​సీఈఓ శృతి, ప్రెసిడెంట్​సాహితిసాయి తెలిపారు.