మాలధారుడి దుస్తులు తొలగించి..యూనిఫాం వేయించి అనుమతి..కాలేజీ తీరుపై హిందూ సంఘాల ఆగ్రహం

మాలధారుడి దుస్తులు తొలగించి..యూనిఫాం వేయించి అనుమతి..కాలేజీ తీరుపై హిందూ సంఘాల ఆగ్రహం

ఘట్​కేసర్, వెలుగు: అయ్యప్ప మాలధారణలో ఎగ్జామ్స్ సెంటర్​కు వెళ్లిన వ్యక్తిని స్వామి దుస్తులు తొలగించి సివిల్​ డ్రెస్సులో కాలేజీ యాజమాన్యం అనుమతించింది. ఆ సంఘటన ఘట్​కేసర్ మండలం నారపల్లి దివ్యానగర్​లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్​ కాలేజీలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల  ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన చందు నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్​ కాలేజీలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 

శుక్రవారం అయ్యప్ప మాల ధరించి కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చాడు. కాలేజీ స్టాఫ్​ మాల దుస్తులు తీసి యూనిఫాం ధరించి రావాలని ఆదేశించారు. అయినా వినకపోవడంతో బలవంతంగా అయ్యప్ప మాల దుస్తులు తీయించి యూనిఫాం వేయించినట్లు బాధితుడు చందు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. రేపు కాలేజీ ఎదుట ఆందోళన చేస్తామని మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బండారి పవన్ రెడ్డి హెచ్చరించారు.