ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని ఒంటికి నిప్పంటించుకుని స్టూడెంట్ సూసైడ్

ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని ఒంటికి నిప్పంటించుకుని స్టూడెంట్ సూసైడ్
  • పెట్రోల్ పోసుకుని ఒంటికి     నిప్పంటించుకుండు
  •  ఓయూ పీఎస్ పరిధిలో ఘటన

ఓయూ, వెలుగు : ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని ఓ స్టూడెంట్ ఒంటికి నిప్పంటించుకుని సూసైడ్ చేసుకున్నాడు. న్యూ  నల్లకుంటకు చెందిన శ్రీకృష్ణ చైతన్య(18) డీడీ కాలనీలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్(ఎంపీసీ) పూర్తిచేశాడు. ఇటీవల జరిగిన ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు. గురువారం ఉదయం ఎంసెట్ ఫలితాలు వెలువడగా.. అందులో  శ్రీకృష్ణ చైతన్య క్వాలిఫై కాలేదు. దాంతో  తీవ్ర మనస్తాపానికి గురైన అతను.. ఇంటి నుంచి సైకిల్​పై ఉస్మానియా వర్సిటీలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకుOU న్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. 

శరీరమంతా మంటలు అంటుకోవడంతో  నొప్పితో శ్రీకృష్ణ చైతన్య కేకలు వేశాడు. అది గమనించిన యునివర్సిటీ పంప్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థికి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీకృష్ణ చైతన్య శరీరానికి 60 శాతం కాలిన గాయాలు కావడంతో అతను చనిపోయాడు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాలేదనే శ్రీకృష్ణ చైతన్య సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు.