
బషీర్బాగ్, వెలుగు: డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే లక్ష్యంగా100 రోజుల మహోద్యమానికి విద్యార్థి సేన సిద్ధమైంది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ సోమనాథం బుధవారం ఆవిష్కరించారు. గతేడాది కాలంలో నార్కోటిక్ బ్యూరో రూ.100 కోట్ల వరకు డ్రగ్స్ ను సీజ్ చేసిందన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థి సేన ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ మహోద్యమంలో తాము భాగస్వామ్యం అవుతామన్నారు. విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనార్థలపై యువతకు అవగాహన కల్పిస్తామన్నారు.
మెహిదీపట్నం: డ్రగ్స్తో జీవితం అంధకారం అవుతుందని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ అన్నారు. మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, విజయ్నగర్కాలనీ డివిజన్లోని ఫుట్బాల్ గ్రౌండ్లో యువతకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.