
సికింద్రాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ఉద్యమిస్తామని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు. అక్టోబర్ మొదటి వారంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగ ప్రజా కోర్టును నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సమావేశం ఏర్పాటు చేసిన నాయకులు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు.