కేసీఆర్​ను గద్దె దించడమే లక్ష్యం.. అక్టోబర్​లో ఓయూలో విద్యార్థి నిరుద్యోగ ప్రజా కోర్టు

కేసీఆర్​ను గద్దె దించడమే లక్ష్యం..  అక్టోబర్​లో ఓయూలో విద్యార్థి నిరుద్యోగ ప్రజా కోర్టు

సికింద్రాబాద్, వెలుగు :  సీఎం కేసీఆర్​ను గద్దె దించడమే  ప్రధాన లక్ష్యంగా ఉద్యమిస్తామని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు.  అక్టోబర్ మొదటి వారంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగ ప్రజా కోర్టును నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద  సమావేశం ఏర్పాటు చేసిన నాయకులు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. 

Also Read :- సిద్దిపేట గడ్డమీది నుంచి బహుజన దండయాత్ర షురూ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఉన్నత విద్య, ఉద్యోగ ఉపాధి కల్పనలో సర్కారు వైఫల్యం చెందినట్లు ఆరోపించారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు వేసి లీకులతో పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచే విద్యార్థి నిరుద్యోగ ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఘర్ ఘర్..గల్లి గల్లి తిరుగుతూ విద్యార్థులను చైతన్య పరుస్తామన్నారు. రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని, విద్యార్థులకు న్యాయం జరిగేలా విద్యార్థి కోర్టును ఏర్పాటు చేస్తున్నామన్నారు.