వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మిస్సింగ్

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మిస్సింగ్

హైదరాబాద్, వెలుగు: కాలేజీకని వెళ్లిన విద్యార్థి మిస్సయ్యాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. మంచిర్యాల గర్మిల్లాకు చెందిన నడిపెల్లి దామోదర్ రావు కుమారుడు ఎన్​. సాత్విక్ (17) గండిమైసమ్మలోని అక్షర కాలేజీలో ఇంటర్ సెకండం ఇయర్ చదువుతున్నాడు. 2018 డిసెంబర్ 31న సాత్విక్ కాలేజీలో అవుటింగ్ తీసుకొని మధ్యాహ్నం 1 .30గంటలకు బయటకు వెళ్లాడు.

నెల రోజులు గడుస్తున్నా కాలేజీ రాకపోవడంతో ..ఈ నెల 2వ తేదీన సాత్విక్ తల్లిదండ్రులకు ఫోన్​ చేసింది కాలేజీ యాజమాన్యం. తమ కుమారుడు ఇంటికి సైతం రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అప్పటి నుంచి బంధువుల ఇండ్లలో,  స్నేహితుల దగ్గర వెతికారు. అయినా.. అచూకీ లభించలేదు. సోమవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమన్ తెలిపారు.

నందమూరి నగర్లో యువతి

ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైంది. KPHB పోలీసుల కథనం ప్రకారం..హైదర్ నగర్ నందమూరినగర్ లో బంగారు ప్రసాద్ ప్రైవేటు బస్సు డ్రైవర్. ఇతడి భార్య సుజిని(22)ఈ నెల 18న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం KPHB పోలీసులకు ఫిర్యాదు చేశాడు.