హెచ్ సీయూ ముందు విద్యార్థులు ఆందోళన..

హెచ్ సీయూ ముందు విద్యార్థులు ఆందోళన..

గచ్చిబౌలిలో హైదరాబాద్ సేంట్రల్ యూనివర్సిటీ( హెచ్ సీయూ)లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మృతి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని  విధ్యార్ధి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. 

రేండు రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసిన యునివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడంతో.. డిసెంబర్ 20వ తేదీ బుధవారం యునివర్సిటీ ప్రధాన గేటు ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యునివర్సిటీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది..  విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని  విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.