స్టూడెంట్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలి : వివేక్ వెంకట స్వామి

స్టూడెంట్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలి : వివేక్ వెంకట స్వామి

ముషీరాబాద్, వెలుగు: అన్నిరంగాల్లో విద్యార్థులు రాణించేలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారు. వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు బుధవారం బాగ్​లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థలను సందర్శించారు.  విద్యాసంస్థలకు చెందిన ఫ్యాకల్టీ, సిబ్బంది, స్టూడెంట్లు వారికి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నేడు జరగనున్న అలుమ్ని, గ్రాడ్యుయేషన్​ డేకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నందున కాలేజీ ఆవరణలో ఏర్పాట్లను వివేక్ దంపతులు పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.