- అప్పు తీర్చడానికి గడువు ఇప్పిస్తానని డబ్బులు డిమాండ్
భూపాలపల్లి అర్భన్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్లో మొదటి ఎస్సై ఇస్లావత్ నరేశ్ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ హరీశ్ కుమార్ కథనం ప్రకారం.. కరీంనగర్కు చెందిన ఉదయ్ శంకర్ భూపాలపల్లిలో ఏసీల బిజినెస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా కొందరి దగ్గర రూ.30 లక్షలు అప్పు చేశాడు. తిరిగివ్వకపోవడంతో అప్పులిచ్చిన వారు భూపాలపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు.
విచారణ కోసం ఉదయ్ శంకర్ను స్టేషన్కు పిలిపించిన ఎస్సై నరేశ్ అప్పు తిరిగివ్వాలని ఒత్తిడి తెచ్చాడు. గడువు కావాలని అడగడంతో లంచం ఇస్తే అలాగే జరుగుతుందని మాటిచ్చాడు. దీంతో ఉదయ్ శంకర్ ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచనలతో శుక్రవారం మొదటి విడతగా రూ.25 వేలను ఎస్సై క్వార్టర్లో ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నరేశ్ సొంత గ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంగయ్యబంజర్ లోని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. నరేశ్ను హైదరాబాద్కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు.