యూట్యూబ్లో హై రెజల్యూషన్ వీడియోలకు సబ్స్క్రిప్షన్ తప్పనిసరి

యూట్యూబ్లో హై రెజల్యూషన్ వీడియోలకు సబ్స్క్రిప్షన్ తప్పనిసరి

మొదటిసారిగా పిక్సెల్ ట్యాబ్లెట్ తీసుకురానుంది గూగుల్. ఈ ట్యాబ్లెట్ వచ్చే ఏడాది కల్లా మార్కెట్లో ఉండనుంది. ఇది గూగుల్ కంపెనీ తయారుచేసిన టెన్సర్ జి 2 ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది. ఇందులో అడ్వాన్స్​డ్ ఇమేజ్​ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ ఫీచర్లు ఉంటాయి.  వీడియో కాలింగ్, ఫొటో ఎడిటింగ్​తో పాటు గూగుల్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ఉండనుంది. 

సబ్​స్క్రయిబర్స్​కి మాత్రమే
యూట్యూబ్​లో వీడియోల్ని ఎక్కువ రెజల్యూ షన్​లో పెట్టుకొని చూస్తారు చాలామంది. అయితే ఇకపై ​ అలా కుదరదు. ఎందుకంటే.. వీడియోల్ని ఎక్కువ రెజల్యూషన్​లో చూసేందుకు ప్రీమియం సబ్​స్క్రిప్షన్ తప్పనిసరి చేయనుంది యూట్యూబ్. ​సబ్ స్క్రిప్షన్ లేనివాళ్లు  వీడియోల్ని  1,440 పిక్సెల్ క్వాలిటీ వరకు మాత్రమే ఉచితంగా చూడొచ్చు. అలాకాకుండా వీడియోల్ని 4 కె (2,160 పిక్సెల్)లో చూడాలంటే.. రూ.129 కట్టి  ప్రీమియం సబ్​స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్​స్క్రిప్షన్​ ఉంటే...  యాడ్స్​ లేకుండా వీడియోలు చూడొచ్చు. బ్యాక్​గ్రౌండ్​లో వీడియోలు ప్లే అవుతాయి. అంతేకాదు యూట్యూబ్ ప్రీమియం మ్యూజిక్​ని ఉచితంగా వినొచ్చు కూడా.