టవర్ ఎక్కిన ఆర్టీసీ కార్మికుడు

టవర్ ఎక్కిన ఆర్టీసీ కార్మికుడు

నాగర్ కర్నూల్ జిల్లా : ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలంటూ మొబైల్ టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు ఓ ఆర్టీసీ కార్మికుడు. ఈ సంఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కొల్లాపూర్ ఆర్టీసీ డిపో  కార్మికుడు డిపో పక్కన ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఎస్సై కొంపల్లి. మురళి గౌడ్, ఫైర్ సిబ్బంది కార్మికున్ని కిందికి దింపి రక్షించారు. కార్మికుడు టవర్ ఎక్కడంతో అక్కడ 2 గంటల దాకా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిపో దగ్గర భారీగా ట్రిఫిక్ జామ్ అయ్యింది.