దీపావళి స్పెషల్ : పూరీ తీరంలో ఇసుకతో శ్రీరాముడి చిత్రం

దీపావళి స్పెషల్ : పూరీ తీరంలో ఇసుకతో శ్రీరాముడి చిత్రం

భారతదేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు బారులు తీరారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరికొందరు వినూత్నంగా దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు.

దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో శ్రీరాముడి చిత్రంతో పాటు, దీపాన్ని తయారు చేశారు. శ్రీరాముడు దీపాన్ని పట్టుకుని.. శుభాకాంక్షలు తెలియజేస్తున్న శిల్పాన్ని రూపొందించారు. 

Also Read :- దీపావళి వేడుకలకు హైదరాబాద్ రెడీ

ఈ  సైకత శిల్పం చూపరులను కట్టిపడేస్తోంది. పట్నాయక్ తన ప్రత్యేక ప్రతిభతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడం ఇదే మొదటిసారి కాదు. చాలా సందర్భాల్లో వివిధ హిందూ దేవతల చిత్రాలను రూపొందించారు.