దీపావళి పండుగను సంబురంగా జరుపుకునేందుకు గ్రేటర్ సిటీ సిద్ధమైంది. మట్టి దీపాలు, పూలు, ఇతర పూజా సామగ్రితో పాటు పటాకులు కొనేవారితో సిటీలోని ప్రధాన మార్కెట్లలో శనివారం రద్దీ కనిపించింది. భోలక్పూర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మాదాపూర్లోని శిల్పారామంలో దీపావళి సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి.
వెలుగు, పద్మారావునగర్/మాదాపూర్/ఫొటోగ్రాఫర్