రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు..కారులో ఏడుగురు

రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు..కారులో ఏడుగురు

జాతీయ రహదారి మీద వేగంగా వెళ్తోన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంపెద్దాపూర్  జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. కారు ఇంజన్ ఫెయిలై షాట్ సర్క్యూట్ తో  కారులో మంటలు వ్యాపించినట్టు సమాచారం అందుతోంది.  

ఏడుగురు వ్యక్తులు కారులో  ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో కారులో ఆకస్మికంగా మంటలు చేలరేగాయని బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం కాగా, అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారు చాకచక్యంగా  సురక్షితంగా బయటపడ్డారు.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న  ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.