
న్యూఢిల్లీ: వడోదరకు చెందిన సుదీప్ ఫార్మా ఐపీఓ ద్వారా నిధులను సేకరించడానికి సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం, ఐపీఓలో రూ. 95 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూతో పాటు 1,00,76,492 షేర్ల ఓఎఫ్ఎస్ ఉంటుంది. ఓఎఫ్ఎస్ ద్వారా సుజిత్ జయసుఖ్ భయానీ, సుజీత్ జయసుఖ్ భయానీ హెచ్యూఎఫ్, శనిల్ సుజిత్ భయానీ, అవని సుజిత్ భయానీ కంపెనీలో తమ వాటాలను విక్రయించనున్నారు. ప్రీ-ఐపిఓ ప్లేస్మెంట్ద్వారా రూ. 19 కోట్ల వరకు సేకరించనున్నారు.