
కీర్తి సురేష్, సుహాస్ లీడ్ రోల్స్లో అని ఐ.వి.శశి తెరకెక్కించిన సెటైరికల్ కామెడీ మూవీ ‘ఉప్పు కప్పురంబు’.బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి ఇతర ముఖ్యపాత్రలు పోషించగా ఐ.వి.రాధిక లావూ నిర్మించారు. జులై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు.
చిట్టి జయపురం అనే చిన్న గ్రామంలోని స్మశానంలో శవాలను పాతి పెట్టడానికి చోటు లేకపోవడంతో హౌస్ ఫుల్ బోర్డు పెడతారు. గ్రామ పెద్దగా కొత్తగా అధికారంలోకి వచ్చిన అపూర్వ (కీర్తి సురేష్).. కాటి కాపరి చిన్న (సుహాస్) సహాయంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించింది అనేది కథ. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వచ్చాను. నా కెరీర్ ప్రారంభంలో నటించిన ‘గీతాంజలి’చిత్రం నుంచి ఈ చిత్ర దర్శకుడు శశి నాకు పరిచయం.
తను నటీనటులకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. సుహాస్తో వర్కింగ్ చాలా సరదాగా జరిగింది. నేను 18 రోజులు ఈ చిత్రానికి వర్క్ చేశాను. నా కెరీర్లోనే తక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా ఇది. ఇదొక కార్టూనిష్, ఫన్, కూఫీ సినిమా. ‘శుభం’ లాంటి హిట్ ఇచ్చిన వసంత్ కథను ఇచ్చాడు.
ఇప్పటివరకూ చూడని డిఫరెంట్ కామెడీతో రాబోతోంది. సీరియస్ విషయాన్ని లైట్ హార్టెడ్గా చెప్పారు. కచ్చితంగా కొత్తగా ఉంటుంది’ అని చెప్పింది. ‘కీర్తి సురేష్తో నటించడం చాలా సంతోషంగా ఉందని సుహాస్ చెప్పాడు. కచ్చితంగా అందరినీ అలరించే సినిమా అవుతుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.