ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా

ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా

ప్రముఖ నటి దివంగత ఎంపీ అంబరీష్ భార్య సుమలత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయం పై క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.  తన భర్త అంబరీష్ రాజకీయ ఆశయాలను కొనసాగిస్తానన్నారు.మండ్య ప్రజలు అంబరీష్ ను ఎంతగానో  ఆదరించారని… తనను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మండ్య లోక్ సభ నుంచి గత మూడు సార్లు గెలిచిన అంబరీష్ గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా మండ్య నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని సుమలత గతంలో ప్రకటించారు. అయితే కాంగ్రెస్ జేడీఎస్ పొత్తులో భాగంగా మండ్య  నియోజకవర్గం జేడీఎస్ కు కేటాయించింది కాంగ్రెస్. తర్వాత ఆమె బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె  ఏ పార్టీలో చేరకుండా  మండ్య నియోజకవర్గం నుంచి ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు.