శ్రీ కృష్ణ జన్మభూమి కేసు: అలహాబాద్​ హైకోర్టు ఉత్తర్వులపై స్టే పొడిగించిన సుప్రీంకోర్టు

 శ్రీ కృష్ణ జన్మభూమి కేసు: అలహాబాద్​ హైకోర్టు ఉత్తర్వులపై స్టే పొడిగించిన సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్‌లోని  మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి -షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి షాహీ ఈద్గా మసీదుకు కమిషన్‌ను నియమిస్తూ  అలహాబాద్ హైకోర్టు  ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు  స్టేను పొడిగించింది.   తదుపరి విచారణ వరకు ఈ స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన అంశంపై విచారణను సుప్రీంకోర్టు  ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఈ కేసులోని వాది ప్రతివాదుల అభ్యర్ధనలను  వ్రాతపూర్వక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

  మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి జన్మభూమి వివాదానికి సంబంధించి అలహాబాద్​ హైకోర్టు నియమించిన కమిషన్​ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
అలహాబాద్ హైకోర్టు మసీదు ప్రాంగణంలో సర్వేను పర్యవేక్షించేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించేందుకు అంగీకరించింది. ఈ ఆలయం ఒకప్పుడు హిందూ దేవాలయంగా ఉండేదని సూచించే గుర్తులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.