చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సోమవారానికి వాయిదా

చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సోమవారానికి వాయిదా

చంద్రబాబు దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్ ను 2023 అక్టోబర్ 9  సోమవారానికి  సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి తన  క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన జస్టిస్ అనిరుద్ధ బోస్,  జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం  విచారణ చేపట్టింది.  

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు.  ఈ కేసులో 17 A అమలు కాలేదని చంద్రబాబు లాయర్లు వాదించగా,  దీనిపై సమాధానం ఇచ్చేందుకు తమకు  సమయం కావాలని సీఐడీ కోరడంతో  వచ్చే సోమవారినికి వాయిదా వేసింది.   ఈ సందర్భంగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు తమకు కూడా సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.